ఆర్టీసీ విలీనానికి సీఎం వైఎస్ జగన్ ఆమోదం
ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కలను సీఎం వైఎస్ జగన్ నెరవేర్చుతున్నారు. వీరిని రాష్ట్ర ప్రభుత్వంలోకి తీసుకోవడానికి ఆయన ఆమోదం తెలపడంతో 52 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ 90 రోజుల పాటు అధ్యయనం చేసిన అనంతరం మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసి నివేదిక సమర్పించింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు