ప్రశాసన్‌నగర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 72 ప్రశాసన్‌నగర్‌లో ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ (ప్లాట్‌ నం.149) జీహెచ్‌ఎంసీ పార్కును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను మంగళవారం జీహెచ్‌ఎంసీ సర్కిల్‌–18 టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కూల్చివేశారు. ప్లాట్‌ నం–149ను ఆనుకుని ఉన్న పార్కును సదరు ఐపీఎస్‌ అధికారి రెండు వైపులా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. అంతే కాకుండా పార్కులోని ఇనుప దిమ్మెలతో అనధికారిక స్ట్రక్చర్‌ కూడా నిర్మించా రు. పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించకపోగా నిబంధనలకు విరుద్ధంగా మరో రెండు అంతస్తులు నిర్మించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top