సర్జికల్‌ స్ట్రైక్స్‌ 2: ఎంత మంది చనిపోయారో లెక్కించలేదు

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత వాయుసేన మెరుపు దాడులు జరిపిన విషయం తెలిసిందే. అయితే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారత్‌లోని రాజకీయం ఈ సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చుట్టే తిరుగుతోంది. ఈ దాడుల్లో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో లెక్క చెప్పాలని, వాటికి ఆధారాలు ఇవ్వాలని ప్రతిపక్షపార్టీలు ప్రశ్నిస్తుండగా..  250 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని అధికార పార్టీ పేర్కొంది. ఇక భారత వాయుసేన ఐఏఎఫ్‌ చీఫ్‌ బీఎస్‌ ధనోవా మాత్రం ఈ మెరుపు దాడుల్లో ఎంత మంది చచ్చారో లెక్కించలేదని తెలిపారు. భారత వాయుసేన ఆ పనిచేయలేదని పేర్కొన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top