300వ రోజు పాదయాత్ర డైరీ
నేటితో ప్రజా సంకల్ప యాత్ర 300వ రోజుకు చేరింది. ఈ రోజు కూడా ఎందరో కాంట్రాక్టు ఉద్యోగులు, మరెందరో నిరుద్యోగులు కలిశారు. అందరిలోనూ ఒకటే ఆందోళన. ఈ పాలనలో ఉద్యోగ భద్రత కొరవడిందని కాంట్రాక్టు ఉద్యోగులు, ఉద్యోగావకాశాలే కరువయ్యాయని నిరుద్యోగులు వాపోయారు. పార్వతీపురానికి చెందిన విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు, హెల్త్ అసిస్టెంట్లు, కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు కలిశారు. ఐదేళ్ల కిందట ఎన్నికలకు ముందు తమనందర్నీ రెగ్యులరైజ్ చేస్తానని బాబుగారు హమీ ఇచ్చి.. మేనిఫెస్టోలో పొందుపరిచారన్నారు. ఓట్లేయించుకుని మాట తప్పారని చెప్పారు. ఆందోళన చేసిన ప్రతిసారీ.. న్యాయం చేసేస్తామంటూ మాయమాటలు చెప్పి.. సమ్మె విరమింపజేసి మోసం చేస్తున్నారని వాపోయారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు