భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 497 డిక్లేర్డ్‌ | India Vs South Africa: India Declared 497 Run | Sakshi
Sakshi News home page

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 497 డిక్లేర్డ్‌

Oct 20 2019 3:49 PM | Updated on Mar 21 2024 8:31 PM

దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా హాఫ్‌ సెంచరీ సాధించాడు. 118 బంతుల్లో 4 ఫోర్లతో హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. అయితే ఆ తర్వాత బంతికే జడేజా ఔటయ్యాడు. అంతకుముంద రోహిత్‌ శర్మ(212), రహానే(115)లు ఆకట్టుకోగా, జడేజా అర్థ  శతకంతో మెరిశాడు. తన ఇన్నింగ్స్‌ ఆద్యంతం నిదానంగా ఆడిన జడేజా.. అవసరమైన సందర్భాల్లో బ్యాట్‌ ఝుళిపించాడు. దాంతో 13వ టెస్టు హాఫ్‌ సెంచరీ సాధించాడు.భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌ను 497/9వద్ద డిక్లేర్డ్‌ చేసింది. భారత్‌ తన ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసే సమయానికి షమీ(10 నాటౌట్‌), నదీమ్‌(1 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement