శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో రెండేళ్ల కాల వ్యవధిలో రికార్డు స్థాయిలో 2,030 మందికి గుండె శస్త్ర చికిత్సలు, 8 మందికి గుండె మార్పిడి శస్త్రచికిత్సలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో చిన్నపిల్లల కోసం ఆస్పత్రి ఉండాలనే ఉద్దేశంతో సీఎం వైయస్ జగన్ 2021లో ఈ ఆస్పత్రిని ప్రారంభించారు.
లక్షలు విలువచేసే గుండె మార్పిడి శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేస్తూ ప్రాణాలు పోస్తున్న పద్మావతి హృదయాలయం నిరుపేదల పాలిట గుండె‘గుడి’గా పూజింపబడుతోంది.