శ్రీదేవి సైకత శిల్పంతో నివాళి! | Sudarshan Pattnaik and Satish Acharya dedicate their heartfelt artworks to the icon | Sakshi
Sakshi News home page

Feb 26 2018 10:20 AM | Updated on Mar 22 2024 10:48 AM

అభిమాన అందాల నటి శ్రీదేవి ఇకలేరన్న (ఫిబ్రవరి 24)  పిడుగులాంటి వార్తతో  యావత్తు సినీ  జగత్తు తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.  దీంతో ప్రపంచవ్యాప్తంగా సోషల్‌ మీడియాలో ఆమె అభిమానులు తీరని విషాదంలో మునిగిపోయారు. సినీ ప్రపంచంలో ధృవతారలా వెలిగిన మెగాస్టార్‌ శ్రీదేవి హఠాన్మరణంపై  పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు  ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చారు. వీరితోపాటు వివిధ రంగాలకు చెందిన కళాకారులు, కార్టూనిస్టులు, ఇతర ప్రముఖులు కూడా ఆమె మరణం పట్ల అంతులేని ఆవేదన ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా  ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌  ఒడిషాలోని పూరీ బీచ్‌లో ఆర్‌ఐపీ  శ్రీదేవి అంటూ సైకత శిల్పంతో ప్రత్యేక నివాళులర్పించారు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement