‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయాలను భ్రష్టుపట్టించారు. వ్యక్తులకు స్థాయిని బట్టి వెలకట్టారు. ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలి’’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఆయన గురువారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో పులివెందుల, రాయచోటి, కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నియోజకవర్గాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో నియోజకవర్గాల వారీగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లను పేరుపేరున పలకరిస్తూ ప్రసంగించారు.
Feb 3 2017 7:28 AM | Updated on Mar 21 2024 5:25 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement