పరుగులో గెలిచాడు.. ప్రాణాలు కోల్పోయాడు! | youth, who stood first in running race of army recruitment, loses life | Sakshi
Sakshi News home page

Jul 8 2015 6:19 PM | Updated on Mar 22 2024 10:59 AM

సైన్యంలో చేరి భరతమాతకు సేవ చేద్దామనుకున్నాడు. పరుగు కూడా విపరీతంగా ప్రాక్టీసు చేశాడు. ఆర్మీ రిక్రూట్మెంటు ర్యాలీకి వచ్చి, పరుగు పందెంలో అందరికంటే ముందు నిలిచాడు. కానీ పోటీ ముగిసిన వెంటనే అక్కడే సొమ్మసిల్లి పడిపోయి.. చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణం విశాఖపట్నంలో జరిగింది. వివరాలు... శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం తుడి గ్రామానికి చెందిన నీలబాబు ఆర్మీ పరుగుపందెంలో పాల్గొన్నాడు. రేస్ పూర్తయిన తర్వాత మొదటి స్థానంలో నిలిచిన నీలబాబు సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన ఆ అభ్యర్థిని స్థానిక కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం సమయంలో నీలబాబు ప్రాణాలు కోల్పోయాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement