ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ బుధవారం అయోధ్యలో పర్యటించారు. వివాదాస్పద రామ్జన్మస్థల్లో తాత్కాలికంగా నిర్మించిన రామ్ లాల్లా ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత పవిత్ర సరయూ నదీతీరాన్ని పరిశీలించారు. అంతకుముందు నగరంలోని హనుమాన్ గర్హ్ ఆలయాన్ని కూడా యోగి దర్శించుకున్నారు.