ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ శనివారం ఉదయం యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆమె నివాసంలో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాలపై సోనియా,దిగ్విజయ్ సింగ్ల మధ్య ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇటీవలే దిగ్విజయ్ సింగ్ ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర విభననపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆటు సీమాంధ్ర నేతలు, ఇటూ తెలంగాణ నేతలు దిగ్విజయ్ సింగ్ను కలసి తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోనియాతో దిగ్విజయ్ సింగ్ భేటీ ప్రాధాన్యం సంతరించుకోంది.
Jul 6 2013 12:52 PM | Updated on Mar 20 2024 3:51 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement