స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని 'స్వచ్చ్గ్రహి' కావాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సంచ్ఛ్ సంరక్షణ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. దీనిని ప్రజాఉద్యమంలా చేపట్టాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారత్ను పూర్తిగా మార్చాలని యత్నిస్తున్నారని వెంకయ్య నాయుడు తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని రాజకీయ, ప్రభుత్వ కార్యక్రమం చేయొద్దని ప్రధాని సూచించారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ కార్యక్రమం విజయవంతం కాదని అన్నారు. దేశంలోని టాప్ నగరాల్లో హైదరాబాద్ ఉండాలన్నదే తమ లక్ష్యం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
Dec 23 2016 4:43 PM | Updated on Mar 21 2024 8:55 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement