దేశవ్యాప్తంగా ‘జీఎస్టీ’ (వస్తు సేవా పన్ను) మోత మోగిపోతుంటే, ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ మంత్రివర్యులు మాత్రం జీఎస్టీ అంటే ఏంటో చెప్పలేక నీళ్లు నమిలారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. యూపీ సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ వ్యవహారాల శాఖ మంత్రి రమాపతి శాస్త్రికి ఈ అనుభవం ఎదురైంది.