విశాఖ జిల్లాలోని గోపాలపట్నం మండలం కొత్తపాలెంలో గుర్తు తెలియని వ్యకి మృతదేహం కలకలం సృష్టించింది. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. దాదాపు 40 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కు తినడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.
Jun 29 2015 10:47 AM | Updated on Mar 21 2024 7:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement