సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ కేసులో తనకు నోటీసులు అందాయని టాలీవుడ్ హీరో నవదీప్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'నోటీసులు వచ్చిన మాట నిజమే. పోలీసుల విచారణలో నేను పూర్తిగా సహకరిస్తాను. నేను ఏ తప్పు చేయలేదు. కానీ అకారణంగా ఊహాగానాలు వ్యాప్తిచేయడం బాధాకరం. కెల్విన్తో సంబంధాలు అంటున్నారు కానీ, ఆ కెల్విన్ ఎవరో నాకు నిజంగానే తెలియదు. మొత్తం సెలబ్రిటీలే చేశారంటూ ప్రచారం చేయడం వల్ల మాకు చాలా డామేజ్ జరుగుతుందని' నవదీప్ అన్నారు. చిన్నప్పుడు చేసిన తప్పులకు ఇప్పటికే నా జీవితం సాఫ్ట్ టార్గెట్గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
డ్రగ్స్ కేసులో నోటీసులు అందాయి: నటుడు
Jul 14 2017 11:19 AM | Updated on Mar 22 2024 11:31 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement