పాకిస్తాన్లో ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయారు. పెషావర్లోని ఓ ఆర్మీ పబ్లిక్ స్కూల్లోకి తెగబడ్డారు. ఆర్మీ దుస్తులు వేసుకుని స్కూల్లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు... టీచర్లు, విద్యార్థులను బందించి కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, వారిలో ముగ్గురు విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనలో సుమారు 20మంది గాయపడినట్లు తెలుస్తోంది. కాగా స్కూల్ను చుట్టుముట్టిన సైన్యంపై ఉగ్రవాదులు పాఠశాల లోపలి నుంచే కాల్పులు జరుపుతున్నారు. ఇక కాల్పులకు తామే బాధ్యులమని తాలిబన్లు ప్రకటించుకున్నారు. మొత్తం 500 మంది విద్యార్ధులను బందీలుగా చేసుకున్నట్లు తెలుస్తుంది. కాల్పులు కొనసాగుతున్నాయి.