రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఖాయమని గాంధేయ మక్కల్ ఇయక్కం అధ్యక్షులు తమిళరువి మణియన్ తెలిపారు. చెన్నైలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చెన్నై పోయెస్ గార్డెన్లోని ఆయన ఇంటిలో ఇటీవల రెండుసార్లు రజనీని కలుసుకున్నానని, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై సుమారు మూడుగంటలకు పైగా చర్చించినట్లు తెలిపారు. తమిళనాడు ప్రజలపై రజనీ ఎంతో అభిమానం, ప్రేమను చాటుకున్నారని, నాలుగు దశాబ్దాల క్రితం చెన్నై చేరుకున్న తనకు సినీ జీవితాన్ని ప్రసాదించిన ప్రజలకు ఏమైనా చేయాలని భావిస్తున్నారని చెప్పారు. ‘ప్రజలకు మేలు చేయాలంటే రాజకీయాల్లోకి రావాలి, తప్పకుండా వస్తాను’ అని తనతో అన్నట్లుగా తమిళరువి తెలిపారు. ఆస్తుల కోసం ఎంతమాత్రం రాజకీయ ప్రవేశం చేయదలుచుకోలేదని, కామరాజనాడార్, అన్నాదురై ఆదర్శంగా నిస్వార్థ రాజకీయాలు సాగించాలని ఆయన ఆశిస్తున్నారని చెప్పారు. మరో రెండు వారాల్లో పార్టీని, అజెండాను ప్రకటిస్తారని తెలిపారు.
Aug 9 2017 3:37 PM | Updated on Mar 22 2024 11:22 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement