రెండు రైళ్లు ఢీ: ఆరుగురు మృతి | six-killed-50-injured-as-2-trains-collide-near-gorakhpur | Sakshi
Sakshi News home page

Oct 1 2014 8:25 AM | Updated on Mar 22 2024 10:46 AM

ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లో గత అర్థరాత్రి రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో 50 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బోగిల మధ్య మరింత ప్రయాణికులు చిక్కుకుని ఉండే అవకాశం ఉందని ... ఈ నేపథ్యంలో మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కాగా గోరఖ్పూర్ మార్గంలో పలురైళ్ల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement