ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లో గత అర్థరాత్రి రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో 50 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బోగిల మధ్య మరింత ప్రయాణికులు చిక్కుకుని ఉండే అవకాశం ఉందని ... ఈ నేపథ్యంలో మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కాగా గోరఖ్పూర్ మార్గంలో పలురైళ్ల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు.
Oct 1 2014 8:25 AM | Updated on Mar 22 2024 10:46 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement