ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు భారత రత్న ఇవ్వాలని కోరుతున్న అమ్మ అభిమానులకు నిరాశ ఎదురైంది. జయలలితకు భారత రత్న ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని మద్రాసు హైకోర్టు కొట్టేసింది. మద్రాసు హైకోర్టు తోసిపుచ్చిన ఈ పిల్తో అమ్మకు భారతరత్న వస్తుందో రాదోనని అన్నాడీఎంకే నేతల్లో ఆందోళన నెలకొంది. డిసెంబర్లో అమ్మ మరణించిన తర్వాత భేటీ అయిన తొలి కేబినెట్ జయలలితకు భారత రత్న ఇవ్వాలని కేంద్రానికి తీర్మానించిన సంగతి తెలిసిందే. దేశంలో అత్యున్నత పౌర పురస్కారంగా భారతరత్నకు పేరొంది.
Jan 7 2017 7:21 AM | Updated on Mar 20 2024 5:21 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement