ఇడుపులపాయకు అభిమాన సంద్రం పోటెత్తింది. మహానేత తనయుడు, జగనేత జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కోర్టు అనుమతితో తండ్రి సమాధిని సందర్శించేందుకు వచ్చిన జగన్ను కలిసేందుకు వచ్చిన అభిమానుల తాకిడి జన సునామీని తలపించింది. తండ్రికి నివాళులు అర్పించిన అనంతరం జగన్ .... ప్రతి ఒక్కరికి అభివాదం చూస్తూ పలకించారు. చాలాకాలం తర్వాత తమ అభిమాన నేతను ప్రత్యక్షంగా కలుసుకునేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. దాంతో ఇడుపులపాయ కిటకిటలాడుతోంది. ఇక కుటుంబ సభ్యులు వైఎస్ వివేకానంద రెడ్డి, అవినాష్ రెడ్డితో పాటు పార్టీ నేతలు అమర్నాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు...ఇతర ముఖ్యనేతలు వైఎస్ఆర్కు నివాళులు అర్పించారు.
Oct 1 2013 10:04 AM | Updated on Mar 21 2024 7:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement