ముని కామకోటికి.. ఉద్యమాలే ఊపిరి. సమైక్యాంధ్రే ఆయన కల. కానీ ఆయన కలలు కల్లలయ్యా యి. రాష్ట్రం ముక్కలైపోయింది. ముఖంలో చిరునవ్వు చెదిరిపోయింది. ఒంటరి జీవితం అలవాటైంది. ప్రత్యేక హోదా కోసం పరితపిస్తున్న నేతలను చూసి నవ్వుకునేవాడు. ఈ నేపథ్యంలోనే శనివారం తిరుపతిలో నిర్వహించిన కాంగ్రెస్ పోరు సభకు వెళ్లాడు. నాయకుల ప్రసంగాలు వింటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ‘తెలుగు జాతి విడిపోయింది, సమైక్య ఉద్యమం చేసినా ఫలితం లేకపోయింది.. తెలుగు జాతి వర్ధిల్లాలి.. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలి..’ అంటూ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గాయాలతో ఆస్పత్రిపాలయ్యాడు.
Aug 9 2015 6:20 AM | Updated on Mar 21 2024 8:17 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement