Sakshi News home page

తెలంగాణలో కొలువుల జాతర

Published Fri, Sep 2 2016 7:11 AM

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) గురువారం గ్రూప్-2 అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసింది. 2015 డిసెంబర్ 30నాటి నోటిఫికేషన్‌లో పేర్కొన్న 439 పోస్టులతోపాటు ప్రస్తుత నోటిఫికేషన్ కింద మరో 593 పోస్టులను చేర్చారు. మొత్తంగా 1,032 పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 2వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.