పోలీస్ శాఖలో నయీమ్ వ్యవహారం దుమారం రేపుతోంది. నాలుగు రోజుల క్రితం నయీమ్ కేసులో హోంశాఖ దాఖలు చేసిన అఫిడవిట్పై వాడివేడిగా చర్చ జరుగుతోంది. పోలీస్ శాఖలో కీలక అధికారులకు కూడా తెలియకుండా అఫిడవిట్ రూపొందిందని, కేవలం అధికారిక సంతకం కోసం మాత్రమే ఉన్నతాధికారులకు అఫిడవిట్ కాపీ చేరినట్టు చర్చ జరుగుతోంది. సాధారణంగా న్యాయస్థానాల్లో పోలీస్ శాఖకు సంబంధించిన కేసుల్లో అఫిడవిట్ వేసే సందర్భాల్లో.. ఉన్నతాధికారులు, న్యాయశాఖ అధికారులు చర్చిస్తారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కౌంటర్ అఫిడవిట్లో పేర్కొంటారు. కానీ ఇక్కడ అలాంటి కార్యక్రమాలేవీ జరగలేదని పోలీసు శాఖలోని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. తమకు కనీస సమాచారం కూడా లేదని, అఫిడవిట్ వివరాలు మీడియాలో చూసిన తర్వాతే తెలిసిందని కీలక అధికారి ఒకరు పేర్కొన్నారు.
Jan 3 2017 7:35 AM | Updated on Mar 21 2024 9:55 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement