విదేశీ మద్యం బాటిళ్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు పట్టుబడ్డ అధికారులను వదలిపెట్టా లంటూ ఏపీకి చెందిన మంత్రి ఒకరు తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చినట్టు తెలిసింది. ఈ అడ్డగోలు దందాలో పోలీసులకు చిక్కిన శంషాబాద్ ఎయిర్పోర్టు కస్టమ్స్ సూపరింటెండెంట్ను వదలిపెట్టాలని, అతడు తనకు మంచి మిత్రుడని చెబుతూ సదరు మంత్రి.. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్కు ఫోన్లో ‘గంట’కొట్టాడు. అయితే సబర్వాల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సూపరింటెండెంట్ను వదిలిపెట్టేది లేదని, అన్ని ఆధారాలు పక్కాగా ఉన్నాయని ఆ అమాత్యుడికి స్పష్టంచేశారు. దీంతో చేసేదేమి లేక ఆ మంత్రి తెలంగాణలోని పలువురు ప్రముఖులతో అకున్ సబర్వాల్కు ఫోన్ల మీద ఫోన్లు చేయించినట్టు తెలుస్తోంది.
May 20 2017 9:31 AM | Updated on Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement