ఎంసెట్ ఫలితాల విడుదల | Sakshi
Sakshi News home page

ఎంసెట్ ఫలితాల విడుదల

Published Mon, Jun 9 2014 5:43 PM

ఎంసెట్ ఫలితాలను తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి ఈ సాయంత్రం ఇక్కడ విడుదల చేశారు. ఎస్ఎంఎస్ల ద్వారా విద్యార్థులకు ర్యాంకుల వివరాలు పంపుతున్నట్లు మంత్రి తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో పవన్ కుమార్ మొదటి ర్యాంక్ సాధించాడు. ఈ నెల 14 నుంచి మార్కుల జాబితా విడుదల చేస్తారు. for results: http://sakshieducation.com/ ఇంజనీరింగ్ విభాగంలో 70.77 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, అగ్రికల్చర్,మెడిసిన్ విభాగంలో 83.16 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఏపిలో 72.59 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, తెలంగాణలో 68.86 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల 15 నుంచి మెడికల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.