ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయుల మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. సునీత, సూరి ఇద్దరూ అధికార టీడీపీకి చెందినవారే అయినా వారి అనుచరుల మధ్య ఫ్లెక్సీల వివాదం ఏర్పడింది. సునీత అనుచరులు ధర్మవరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా, స్థానిక ఎమ్మెల్యే సూరి అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం ఏర్పడింది. సూరి అనుచరులు సునీత వర్గీయుల ఫ్లెక్సీలను తొలగించడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరస్పరం దాడి చేసుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడే ఉన్న పోలీసులు ఈ తతంగాన్ని చూస్తూ ఉండిపోయారు. సూరి వర్గీయులను అరెస్ట్ చేయాలని పరిటాల సునీత అనుచరులు ఆందోళనకు దిగారు.
Oct 26 2016 8:14 PM | Updated on Mar 21 2024 7:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement