క్యాష్ కష్టాలు.. ఏ‘మనీ’ చెప్పాలి | Sakshi
Sakshi News home page

క్యాష్ కష్టాలు.. ఏ‘మనీ’ చెప్పాలి

Published Sat, Dec 3 2016 9:56 AM

నగదు నిల్వలు రూ.100 కోట్లు ఉన్నారుు.. బుధవారం మరో రూ.162 కోట్లు వచ్చారుు..కానీ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన జీతభత్యాలు, పెన్షన్ల మొత్తంరూ.900 కోట్లు.. వీరు కాక నగదు కోసం బ్యాంకులకు వచ్చే సామాన్య ప్రజలు, వ్యాపారులుఉండనే ఉంటారు.. ఈ అంకెలు చూస్తే చాలు.. ఎందరు జీతాలు అందుకున్నారో.. మరెందరు వృద్ధులు, వికలాంగులు పెన్షన్ల కోసం అగచాట్లు పడ్డారో అర్థమైపోతుంది..ఎవరికీ ఏ ఇబ్బంది లేదని నగదు సర్దుబాటు చేశామన్న అధికారుల ప్రకటనలను.. ‘నో క్యాష్’ బోర్డులతో దర్శనమిస్తున్న 80 శాతానికిపైగా ఏటీఎంలు, బ్యాంకు శాఖలు వెక్కిరిస్తున్నారుు.