ఘోర రైలు ప్రమాదం: 30 మంది మృతి | Sakshi
Sakshi News home page

ఘోర రైలు ప్రమాదం: 30 మంది మృతి

Published Sun, Nov 20 2016 7:27 AM

ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం వేకువజామున ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 30 మందికి పైగా మృతిచెందినట్లు రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. అధికారుల కథనం ప్రకారం.. యూపీలోని దేహత్ జిల్లా కాన్పుర్ సమీపంలోని పక్హరయన్‌ వద్ద పట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలు 14 బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 30మందికి పైగా మృతిచెందగా, పలువురు ప్రయాణికులు గాయపడ్డట్లు అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement