అన్నకు నివాళులు.. అసెంబ్లీకి తమ్ముళ్లు.. | chandrababu along with tdp mlas pays tribute to party founder ntr | Sakshi
Sakshi News home page

Aug 31 2015 9:12 AM | Updated on Mar 22 2024 11:19 AM

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ పార్టీ సంప్రదాయాన్ని అనుసరిస్తూ తెలుగుదేశం నాయకులు.. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు సమాధి వద్ద నివాళులు అర్పించారు. సోమవారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు సహా పార్టీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ సమాధివద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా 'ఎన్టీఆర్ అమర్ రహే' అంటూ కార్యకర్తలు నినదించారు. పలువురు ఎమ్మెల్యేలతో మాటామంతి జరుపుతూ సీఎం చంద్రబాబు ఉల్లాసంగా కనిపించారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి బయలుదేరారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement