అనంతపురం లోక్సభ సభ్యుడు, టీడీపీ నేత జేసీ దివాకర్రెడ్డి మరో సారి సంచలన వ్యాఖ్యలకు తెర తీశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసినా ఏపీకి ప్రత్యేక హోదా రాదని జేసీ దివాకర్రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్ లో ఏపీకి వచ్చిన వచ్చిన జేసీ దివాకర్రెడ్డి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందంటే నేను, మరో 10 మంది ఎంపీలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.