ఏపీ ప్రభుత్వానికి కేంద్రం మరో షాక్‌ | central government shock to andhra pradesh government over polavaram project issue | Sakshi
Sakshi News home page

Apr 11 2017 12:28 PM | Updated on Mar 20 2024 3:11 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కేంద్రం మరో షాక్‌ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్ట్‌ అంచనా వ్యయం పెరిగితే రాష్ట్రమే భరించాలని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. 2014 ఏప్రిల్‌ నాటి అంచనా వ్యయాన్నే కేంద్రం భరిస్తుందని కేంద్రమంత్రి ఉమా భారతి స్పష్టం చేశారు. రాష్ట్రానికి వర ప్రదాయిని అయిన పోలవరం ప్రాజెక్టుకు 2017–18 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.9 కోట్లను మాత్రమే కేటాయించింది. పోలవరం ప్రాజెక్ట్‌ వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిన స్థాయిలో కేంద్రం రుణం మంజూరు చేసే అవకాశం లేదని కరాఖండిగా చెప్పడం ఏపీ సర్కార్‌కు నిరాశే మిగిల్చింది.

Advertisement
 
Advertisement
Advertisement