ఓటుకు కోట్లు: రంగంలోకి దిగిన ఎన్నికల సంఘం | Cash For Vote: Central Election commission wants Video, Audio tapes | Sakshi
Sakshi News home page

Jun 25 2015 5:24 PM | Updated on Mar 22 2024 10:59 AM

ఓటుకు కోట్లు కేసులో కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలుగా ఏసీబీ సమర్పించిన 14 ఆడియో, వీడియో టేపుల కాపీలను తమకు ఇవ్వాల్సిందిగా కోరుతూ సీఈసీ తరఫు న్యాయవాది ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ టేపులు అసలువా.. కాదా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు వీటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపిన విషయం తెలిసిందే. ల్యాబ్ నుంచి వీటిపై ప్రాథమిక నివేదిక కూడా ఇప్పటికే వచ్చింది. ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చిన టేపులను ఏసీబీ కోర్టు పరిశీలిస్తోంది. ఈ లోపే కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి కూడా తమకు ఈ టేపులు కావాలన్న మెమో దాఖలైంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement