సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ రిలయన్స్ ఏడీఏ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ముందుగా ఖరాయిన వ్యాపారసంబంధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వున్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 15 తర్వాత ఏ రోజైనా కోర్టు ముందు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని న్యాయస్థానానికి తెలిపారు. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కుంభకోణం కేసులో ప్రాసిక్యూషన్ తరఫు సాక్షిగా రేపు తమ ముందు హాజరుకావాలని అనిల్ అంబానీకి సీబీఐ పత్యేక కోర్టు సమన్లు జారీచేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించగా విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
Jul 25 2013 1:49 PM | Updated on Mar 22 2024 11:26 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement