‘బర్ద్వాన్’కు శారదా స్కాం డబ్బు! | amit-shah-addresses-rally-in-kolkata-attacks-mamata-banerjee-over-saradha-scam | Sakshi
Sakshi News home page

Dec 1 2014 10:11 AM | Updated on Mar 21 2024 5:16 PM

పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అవినీతి పాలన అంతమయ్యేందుకు సమయం దగ్గర పడిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. రాష్ట్రం నుంచి టీఎంసీని కూకటివేళ్లతో పెకిలించేందుకే తానిక్కడికి వచ్చానన్నారు. లోక్‌సభ ఎన్నికల విజయంతో ప్రారంభమైన మోదీ విజయ ప్రస్థానం.. 2016లో జరిగే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో ముగుస్తుందన్నారు. ‘టీఎంసీ లేని పశ్చిమబెంగాల్’ మోదీ తాజా నినాదమని తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement