బైక్‌ డివైడర్‌ను ఢీకొని ఇంజినీరింగ్‌ విద్యార్థి.. | - | Sakshi
Sakshi News home page

బైక్‌ డివైడర్‌ను ఢీకొని ఇంజినీరింగ్‌ విద్యార్థి..

May 12 2026 5:30 AM | Updated on May 12 2026 5:30 AM

ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని జమ్మలమడుగు రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చెప్పలి నాగమల్లేష్‌ (22) దుర్మరణం చెందాడు. ట్రాఫిక్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన నాగమల్లేష్‌ బీటెక్‌ చదివాడు. సోమవారం పరీక్ష రాసి వచ్చిన అతను తన స్నేహితుడు తాళ్లప్రొద్దుటూరుకు చెందిన మహేష్‌ను బస్సు ఎక్కించేందుకు బైక్‌లో బయలుదేరాడు. ఈ క్రమంలో బుడ్డాయపల్లె సమీపంలోకి రాగానే బైక్‌ డివైడర్‌ను ఢీ కొంది. ఈ ఘటనలో నాగమల్లేష్‌ అక్కడిక్కడే మృతి చెందగా మహేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన అతన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. నాగమల్లేష్‌ తండ్రి చిన్న వెంకటేష్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయంలో గుమస్తాగా పని చేస్తున్నాడు. కుమారుడు మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధించసాగారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement