
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దు
మోటకొండూర్: విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దని బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మాధురి, యువమోర్చా జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్ అన్నారు. మోటకొండూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో సీఈసీ గ్రూప్ను అప్పాజిపేటకు గురుకుల పాఠశాలకు తరలించొద్దని డిమాండ్ చేస్తూ బీజేపీ మండల అధ్యక్షుడు ఝెల్లంల శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్ సీఈసీ గ్రూప్ను ఇక్కడే కొనసాగించాలన్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు పీసరి తిరుమలరెడ్డి, చిర్ర రవీందర్, పన్నాల చంద్రశేఖర్రెడ్డి, తండ కృష్ణగౌడ్, జోరుక ఎల్లేష్, ఆలేటి నాగరాజు, శనిగరం ప్రదీప్, దాసరి నాగరాజు పాల్గొన్నారు.
ఫ బాలికల గురుకుల పాఠశాల
ఎదుట బీజేపీ నాయకుల ధర్నా