
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
సూర్యాపేటటౌన్: తాళం వేసిన ఇళ్లే టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను గురువారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కె. నరసింహ విలేకరులకు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ పట్టణానికి చెందిన ఇటికాల ఫణిచంద్, కోదాడకు చెందిన నాగేంద్రబాబు, మరో ఇద్దరు బాలురు జల్సాలకు అలవాటుపడి రాత్రిపూట తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నారు. చోరీ చేసిన సొత్తును అమ్మేందుకు కోదాడ పట్టణానికి రాగా స్థానిక పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి ఎనిమిది తులాల బంగారం, బైక్, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఫణిచంద్ వివిధ పోలీస్ స్టేషన్లలో 17 కేసులు ఉన్నాయని, గతంలో జైలుకు వెళ్లి కూడా వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. ఫణిచంద్, నాగేంద్రబాబును రిమాండ్కు తరలించగా.. ఇద్దరు బాలురను జువైనల్ హోంకు తరలించినట్లు తెలిపారు. నిందితులను పట్టుక్ను కోదాడ పోలీసులను ఎస్పీ అభినందించారు
ఫ నలుగురు దొంగల అరెస్ట్