ఈతకు వెళ్లి రైల్వే ఉద్యోగి మృతి | - | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి రైల్వే ఉద్యోగి మృతి

Jun 19 2025 3:49 AM | Updated on Jun 19 2025 3:49 AM

ఈతకు వెళ్లి రైల్వే ఉద్యోగి మృతి

ఈతకు వెళ్లి రైల్వే ఉద్యోగి మృతి

డోర్నకల్‌: స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన రైల్వే ఉద్యోగి ప్రమాదవశాత్తు నీటమునిగి చనిపోయాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ సమీపంలోని మున్నేరువాగులో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ఎర్రంశెట్టి సందీప్‌(28) డోర్నకల్‌లో రైల్వే ట్రైన్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం మిత్రులతో కలిసి సరదాగా మున్నేరువాగులో ఈతకు వెళ్లాడు. అక్కడ మిత్రులు ఈత కొడుతుండగా ఈతరాని సందీప్‌ వాగు ఒడ్డున నీటిలోకి దిగాడు. ప్రమాదవశాత్తు వాగులోకి జారి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానిక మత్స్యకారుల సాయంతో వాగులోనుంచి సందీప్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడికి నాలుగు నెలల క్రితం వివాహం జరిగినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement