తప్పు అధికారులది.. శిక్ష వినియోగదారుడికి.. | - | Sakshi
Sakshi News home page

తప్పు అధికారులది.. శిక్ష వినియోగదారుడికి..

Jun 19 2025 3:49 AM | Updated on Jun 19 2025 3:49 AM

తప్పు అధికారులది.. శిక్ష వినియోగదారుడికి..

తప్పు అధికారులది.. శిక్ష వినియోగదారుడికి..

నల్లగొండ: విద్యుత్‌ శాఖ అధికారులు చేసిన తప్పిదానికి వినియోగదారుడు బలైన సంఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. గృహ వినియోగానికి.. కమర్షియల్‌ విద్యుత్‌ మీటర్‌ అమర్చడంతో ఒక్క నెలలోనే రూ.1.50లక్షల కరెంట్‌ బిల్లు వచ్చింది. ఇదేమిటని సదరు వినయోగదారుడు విద్యుత్‌ అధికారుల వద్దకు వెళ్తే.. కమర్షియల్‌ మీటర్‌ తీసేసి గృహానికి సంబంధించిన మీటర్‌ పెట్టారు. కానీ పాత బిల్లు సరిచేస్తామని చెప్పిన అధికారులు ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోలేదు. తాజాగా బిల్లు మొత్తం చెల్లించాలంటూ విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.

ఐదేళ్లుగా కాలయాపన..

నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని చంద్రగిరి విల్లాస్‌లో నివాసముంటున్న మేడి లింగయ్య అలియాస్‌ లింగస్వామి ఇంటికి 2014లో (సర్వీస్‌ నంబర్‌ 0401402486) కమర్షియల్‌ మీటర్‌ను విద్యుత్‌ అధికారులు పెట్టారు. అయితే లింగయ్య పని నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటాడు. ప్రతి నెల నల్లగొండకు వచ్చినప్పుడల్లా కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తున్నా కూడా కడుతూ వచ్చాడు. కరెంట్‌ బిల్లు ఎక్కువ వస్తుందని 2020లో విద్యుత్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. మీటర్‌ చెక్‌ చేస్తామంటూ డీడీలు కూడా కట్టించుకున్నారు. ఈ మేరకు మీటర్‌ను చెక్‌ చేసి అది కమర్షియల్‌ మీటర్‌ అని అధికారులు రిపోర్టు ఇచ్చి ఆ మీటర్‌ను మార్చారు. అప్పటి వరకు కరెంట్‌ బిల్లు రూ.1.50లక్షలకు చేరుకుంది. మీటర్‌ మార్చిన సందర్భంలో పాత బిల్లంతా రివైజ్‌ చేస్తామని చెప్పడంతో లింగయ్య దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకు విద్యుత్‌ అధికారులు, ఏడీఏలు కూడా సంతకం చేసి అంగీకరించారు. ఆ తర్వాత బిల్లు తగ్గించకుండానే కొత్త బిల్లుతో పాటు పాత బిల్లు కలుపుతూ వస్తున్నారు. ఈ విషయంపై ఏఈ, డీఈ, ఎస్‌ఈలతో పాటు విద్యుత్‌ వినియోగదారుల ఫోరంలో కూడా లింగయ్య దరఖాస్తులు ఇవ్వడంతో బిల్లును సరిచేస్తామని చెప్పి దాటవేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆ బిల్లు రూ.1.79లక్షలకు చేరుకుంది. అయితే బిల్లు మొత్తం చెల్లించాలంటూ మంగళవారం లింగయ్య ఇంటికి విద్యుత్‌ సరఫరాను నిలిపివేయడంతో అతడు విద్యుత్‌ ఆపరేషన్స్‌ ఎస్‌ఈ వద్దకు వెళ్లి ప్రశ్నించగా.. విద్యుత్‌ సరఫరాను తిరిగి పునరుద్ధరించారు. కానీ బిల్లులో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో లింగయ్య న్యాయపరంగా ముందుకు వెళ్తానంటూ సాక్షికి వివరించాడు. విద్యుత్‌ అధికారులు చేసిన పొరపాటును సరిదిద్దుకోకుండా తనను ఇబ్బందులకు గురిచేస్తూ విద్యుత్‌ సరఫరా నిలిపివేయడం ఎంత వరకు సమంజసమని లింగయ్య వాపోతున్నాడు.

ఫ గృహ వినియోగానికి కమర్షియల్‌ విద్యుత్‌ మీటర్‌ ఇచ్చిన అధికారులు

ఫ కరెంట్‌ బిల్లు ఎక్కువ వస్తుండడంతో మీటర్‌ మార్పు

ఫ బిల్లు సరిచేస్తామని చెప్పి

ఏళ్ల తరబడి సాగదీత

ఫ మొత్తం బిల్లు చెల్లించాలంటూ విద్యుత్‌ సరఫరా నిలిపివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement