రూ.3.50లక్షల విలువైన కిట్‌లు పంపిణీ | - | Sakshi
Sakshi News home page

రూ.3.50లక్షల విలువైన కిట్‌లు పంపిణీ

Jun 19 2025 3:49 AM | Updated on Jun 19 2025 3:49 AM

రూ.3.

రూ.3.50లక్షల విలువైన కిట్‌లు పంపిణీ

సంస్థాన్‌ నారాయణపురం: ౖెహదరాబాద్‌కు చెందిన రిలయబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సంస్థాన్‌నారాయణపురంలోని జిల్లా పరిషత్‌ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల విద్యార్థులకు బుధవారం స్కూల్‌ కిట్‌లు అందజేశారు. 340 మంది విద్యార్థులకు రూ.3.50 లక్షల విలువ చేసే స్కూల్‌ కిట్‌లను డీఈఓ సత్యనారాయణ, ట్రస్ట్‌ ఎండీ తుపాకుల రవి అందజేశారు. రిలయబుల్‌ ట్రస్ట్‌ సహకారం అభినందనీయమని, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతలు ముందుకురావాలని డీఈఓ కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రమోద్‌కుమార్‌, ఎంఈఓ శ్రీనివాస్‌, హెచ్‌ఎంలు రమాదేవి, ఉదయ, కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్‌ శివరంజని, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పర్నె శివారెడ్డి, సుక్క సుదర్శన్‌, ఆముదాల పరమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

షార్ట్‌ సర్క్యూట్‌తో బేకరీలో మంటలు

మిర్యాలగూడ అర్బన్‌: బేకరీలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగి సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలో బుధవారం జరిగింది. వివరాలు.. మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్‌ చౌక్‌ వద్ద గల గోకుల్‌ బేకరీలో పై అంతస్తులో సామగ్రి నిల్వ చేసిన గదిలో బుధవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు మంటలను అదుపులోకి తెచ్చారు. రూ.4.50లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు రాహుల్‌ అగర్వాల్‌ తెలిపాడు.

రూ.3.50లక్షల విలువైన కిట్‌లు పంపిణీ1
1/1

రూ.3.50లక్షల విలువైన కిట్‌లు పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement