మహిళ మృతికి కారణమైన ఇద్దరి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

మహిళ మృతికి కారణమైన ఇద్దరి రిమాండ్‌

Jun 19 2025 3:49 AM | Updated on Jun 19 2025 3:49 AM

మహిళ మృతికి కారణమైన ఇద్దరి రిమాండ్‌

మహిళ మృతికి కారణమైన ఇద్దరి రిమాండ్‌

తాళ్లగడ్డ (సూర్యాపేట): మహిళ మృతికి కారణమైన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం సూర్యాపేట రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో రూరల్‌ సీఐ రాజశేఖర్‌ విలేకరులకు వెల్లడించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు మండలం కోటపహాడ్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని తెట్టెకుంట తండాకు చెందిన బాణోతు విజయ (36)ను అదే తండాకు చెందిన బాణోతు ఉపేందర్‌ లైంగికంగా వేధిస్తూ తరచూ ఫోన్‌ చేసి ఇబ్బంది పెట్టేవాడు. ఈ నెల 13న ఉదయం కూడా ఉపేందర్‌ విజయకు ఫోన్‌ చేయగా ఆమె కుమార్తె అఖిల ఎత్తింది. శ్రీమీ అమ్మ ఎటు వెళ్లిందిశ్రీ అంటూ దుర్భాషలాడాడు. కాసేపటికే ఉపేందర్‌ భార్య శారద విజయ ఇంటికి వెళ్లి తన భర్తతో వివాహేతర సంబంధంపై ప్రశ్నించడంతో విజయ మనస్తాపం చెంది అదే రోజు పొలం దగ్గర పురుగుల మందు తాగింది. అనంతరం ఇంటికి వచ్చిన విజయ వాంతులు చేసుకోవడంతో ఆమె కుమార్తె గ్రామస్తుల సాయంతో సూర్యాపేట జనరల్‌ హాస్పిటల్‌లో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఈ నెల 15న మృతిచెందింది. విజయ భర్త బాలు ఫిర్యాదు మేరకు బాణోతు ఉపేందర్‌, బాణోతు శారద, ఉపేందర్‌ అన్న గంగరాజు, వదిన మంగమ్మపై ఆత్మకూరు ఎస్‌ఐ శ్రీకాంత్‌గౌడ్‌ కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం బాణోతు ఉపేందర్‌, అతని భార్య శారదను రూరల్‌ సీఐ రాజశేఖర్‌ అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఉపేందర్‌ అన్న గంగరాజు, వదిన మంగమ్మ పాత్ర గురించి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కార్యక్రమంలో ఆత్మకూర్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement