
19న ప్రధానాలయాల ఉద్యోగుల సమావేశం
యాదగిరిగుట్ట: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల ఉద్యోగుల సమావేశం ఈనెల 19వ తేదీన యాదగిరిగుట్ట పట్టణంలో నిర్వహించనున్నట్లు దేవాలయ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు గజివెల్లి రమేష్బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, కొండగట్టు, కొమురవెల్లి, బాసర ఆలయాల్లో పనిచేస్తున్న మతపర, మినిస్టీరియల్, నాల్గో తరగతి సిబ్బంది సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని పాత గోశాలలో గల ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు సమావేశం జరుగుతుందన్నారు. టీఎన్టీఓల సెంట్రల్ యూనియన్, రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు ఆయన వెల్లడించారు.
ఆంజనేయుడికి
నాగవల్లి దళార్చన
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న ఆంజనేయస్వామికి నాగవల్లి దళార్చన శాస్త్రోక్తంగా చేపట్టారు. మంగళవారం ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో ప్రధానాలయం, విష్ణు పుష్కరిణి, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామి విగ్రహాలను సింధూరంతో అలంకరించి, పాలాభిషేకం, తమలపాకులతో అర్చన చేశారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ప్రధానాలయంలోనూ సంప్రదాయంగా కొనసాగాయి. శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర సేవలు నిర్వహించారు.
రాష్ట్రస్థాయి హాకీ
పోటీలకు ఎంపిక
భువనగిరిటౌన్ : ఉమ్మడి జిల్లా సబ్ జూనియర్ హాకీ జట్టు తరఫున రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికై న ఆలేరు విద్యార్థులను కలెక్టర్ హనుమంతరావు మంగళవారం తన చాంబర్లో అభినందించారు. ఉత్తమ ప్రదర్శన కనబరిచి రాష్ట్ర జట్టులోనూ చోటు సంపాదించాలని వారికి సూచించారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థుల్లో గడ్డం సందీప్, బీరు సాయిగణేష్, రాజబోయిన మణికంఠ, శనిగరం పార్థసారధి, కె.వెంకటేష్ ఉన్నారు. వీరు ఇటీవల అదిలా బాద్లో జరిగిన సబ్ జూనియర్స్ చాంపియన్ షిప్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావు, క్రీడల అభివృద్ధి అధికారి ధనుంజయనేయులు పాల్గొన్నారు.
19న వాసాలమర్రికి
మంత్రి పొంగులేటి రాక
తుర్కపల్లి: రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఈనెల 19న తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి రానున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో 227 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా మంజూరు పత్రాలు అందజేయనున్నారు. ఇందుకు సంబంధించి గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను మంగళవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు, భువనగిరి అర్డీఓ కృష్ణారెడ్డి పరిశీలించారు. వారి వెంట తహసీల్దార్ దేశ్యానాయక్, కొక్కండ సత్తయ్య, పలుగుల లింగయ్య, బాబు, వెంకటేష్ తదితరులు ఉన్నారు.

19న ప్రధానాలయాల ఉద్యోగుల సమావేశం

19న ప్రధానాలయాల ఉద్యోగుల సమావేశం