
● తరలించకపోతే ముప్పే..
రామన్నపేట మండలం వెల్లంకి సబ్స్టేషన్ నుంచి పదిహేనేళ్ల క్రితం సిరిపురం శివారులో ఏర్పాటు చేసిన క్రషర్కు విద్యుత్ లైన్ వేశారు. లైన్ కోసం వెల్లంకి గ్రామంలోని ఈదుల చెరువులో స్తంభాలు పాతారు. అప్పట్లో చెరువులో నీళ్లు లేకపోవడం వల్ల ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. కొన్నేళ్లుగా పిల్లాయిపల్లి కాలువ నీటితో చెరువు ఎప్పడూ నిండుగా ఉంటుంది. స్తంభాల్లో కొన్ని వంగిపోయాయి. మరమ్మతులు ఏర్పడినప్పుడు విద్యుత్ సిబ్బంది బోటు సాయంతో వెళ్లి సరి చేయాల్సి వస్తుంది. పశువులు నీళ్లు తాగే సమయంలో, గ్రామస్తులు చేపలు పట్టే సమయంలో ప్రాణాపాయం సంభవించే ప్రమాదం లేకపోలేదు. విద్యుత్ స్తంభాలను సురక్షితమైన
ప్రాంతం నుంచి ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. – రామన్నపేట