ముందస్తు జాగ్రత్తలతోనే వ్యాధుల నివారణ | - | Sakshi
Sakshi News home page

ముందస్తు జాగ్రత్తలతోనే వ్యాధుల నివారణ

Jun 18 2025 3:03 AM | Updated on Jun 18 2025 3:03 AM

ముందస్తు జాగ్రత్తలతోనే వ్యాధుల నివారణ

ముందస్తు జాగ్రత్తలతోనే వ్యాధుల నివారణ

సాక్షి,యాదాద్రి : సీజనల్‌ వ్యాధులు ప్రభలకుండా ముందస్తు జాగ్రత్తగా నివారణ చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పంచాయతీ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, వీధుల్లో పిచ్చిమొక్కలను తొలగించాలని, వాటర్‌ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రపర్చాలని సూచించారు. వసతి గృహాల్లో నీటి ట్యాంకులను క్లోరినేషన్‌ చేసి శుభ్రపరచాలన్నారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే– డ్రై డే గా పాటించాలని, దోమల నివారణకు ఫాగింగ్‌ చేయాలని, అవసరమైన చోట ఆయిల్‌ బాల్స్‌ వేయాలని, నీటి పైపులైన్లకు మరమ్మతులు చేయాలని స్పష్టం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలు, వసతిగృహాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీపీఓ సునంద, డీఎంహెచ్‌ మనోహర్‌, మిషన్‌ భగీరథ ఎస్‌ఈ కరుణాకర్‌, ఎస్సీ సంక్షేమ అధికారి జినుకల శ్యాంసుందర్‌ మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీఓలు పాల్గొన్నారు.

అభివృద్ధిలో ముందుండాలి

అభివృద్ధిలో గ్రామాలను జాతీయస్థాయిలో ముందుంచాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ భాస్కర్‌ రావు సూచించారు. పల్లెల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మండల పరిషత్‌, పంచాయతీరాజ్‌ అధికారులతో కలెక్టరేట్‌లో శిక్షణ ఇచ్చారు. అభివృద్ధికి సంబంధించి తొమ్మిది అంశాలపై వారికి అవగాహన కల్పించారు. వీటిని పక్కాగా అము చేస్తే గ్రామాలు అలవోకగా అభివృద్ధి చెందుతాయన్నారు.

అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement