భూ భారతితో సమస్యలు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

భూ భారతితో సమస్యలు పరిష్కారం

Jun 18 2025 3:03 AM | Updated on Jun 18 2025 3:03 AM

భూ భారతితో సమస్యలు పరిష్కారం

భూ భారతితో సమస్యలు పరిష్కారం

వలిగొండ : భూ భారతి చట్టంతో భూసమస్యల పరిష్కారానికే సత్వర పరిష్కారం లభించనుందని అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) వీరారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వలిగొండ మండలంలోని పహిల్వాన్‌పురం, వేములకొండ గ్రామాల్లో భూ భారతి సదస్సులు నిర్వహించారు. పహిల్వాన్‌పురం సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. కొత్త చట్టం ద్వారా భూముల లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్‌, ఆర్‌ఓఆర్‌ వంటి సేవలు సలుభంగా పరిష్కారం అవుతాయన్నారు. రెవెన్యూ సదస్సులు ముగిసిన అనంతరం దరఖాస్తులను పరిశీ లించి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. పహిల్వాన్‌పురంలో 41, వేములకొండలో 23 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ దశరథ, డిప్యూటీ తహసీల్దార్‌ పల్లవి, రెవెన్యూ అధికారులు మనోహర్‌, కర్ణాకర్‌రెడ్డి, నగేష్‌, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement