
మత్స్య పరిశ్రమకు పెరుగుతున్న ఆదరణ
సీ్త్రశక్తికి తగిన గుర్తింపు
ఆక్వా రంగం (చేపల పెంపకం)లో మహిళలను ప్రోత్సహించేలా రాష్ట్రం నుంచి ఆరుగురు మహిళలను ఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు పంపించగా.. అందులో నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన వంపు స్వాతి కూడా ఉన్నారు. నిరుపేద దళిత మహిళ అయిన స్వాతి తన భర్త సహకారంతో సాగుకు యోగ్యంకాని తన మూడెకరాల భూమిలో చిన్న చెరువులను ఏర్పాటు చేసుకుని చేపల పెంపకం చేపట్టి విజయవతంగా ముందుకు సాగుతోంది. తొలుత చేపలను పెంచాలనే ఆసక్తితో తనకున్న వంపు భూమిలో నీరు నిలిచే గుంతలో కొర్రమీనలు సాగు చేసుకోగా అదే వృత్తిగా మరింతగా విస్తరించారు.
గుర్రంపోడు: వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఒకటైన చేపల పెంపకంపై ఆదరణ పెరుగుతోంది. సాగునీటి వసతి పుష్కలంగా ఉండి పంటలకు అనువైన భూములు లేని చోట్ల ఆసక్తి ఉన్న రైతులు చేపల చెరువులను తవ్వుకుని చేపల పెంపకం చేపడతూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. గుర్రంపోడు మండలంలో సుమారు వంద ఎకరాల్లో చెరువులను ఏర్పాటు చేసుకుని చేపలను పెంచుతున్నారు. ప్రధానంగా పంటలకు అనువుగా లేని చౌడు భూముల్లో, వాగు నీటి వంపుల్లో చేపల చెరువులు ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. మత్స్యశాఖతో పాటు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా అందుతున్న సబ్సిడీ అందిస్తుండడంతో ఏటా చేపల పెంపకం చేపడుతున్న రైతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
కోనసీమను తలపించేలా..
ఐదెకరాలు, పదెకరాల వరకు చేపల చెరువులను తవ్వుకుని చేపల చెరువులను ఏర్పాటు చేసుకున్న చోట్ల కోససీమను తలపించే వాతావరణం కనిపిస్తుంది. గుర్రంపోడు మండలంలోని వెంకటాపురం(కె) గ్రామంలో రామగిరి వెంకటరమణారావు అనే రైతు తనకు 20 ఎకరాల్లో, ఆమలూరు గ్రామానికి లక్ష్మయ్య సుమారు 30 ఎకరాల్లో చేపల చెరువులను ఏర్పాటు చేసుకుని చేపలను పెంచుతున్నారు. కొయగూరవానిబావి, తేనపల్లి, గుర్రంపోడు, చేపూరు తదితర గ్రామాల్లో చేపల చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల్లో బొచ్చ, రవ్వ, రూప్చంద్, కొర్రమేను తదితర రకాల చేపలను పెంచుతున్నారు.
సొంతంగా దాణా తయారీ..
చేపల దాణా అవసరమైన ముడిసరుకులను రైతులే స్వయంగా తెచ్చుకుని చైనాతో పాటు ఢిల్లీ, రాజస్తాన్ ప్రాంతాల నుంచి యంత్రాలను దిగుమతి చేసుకుని పెద్ద షెడ్డు ఏర్పాటు చేసుకుని దాణా తయారు చేసుకుంటున్నారు.
వెంకటాపురంలోని చేపల చెరువు
ఏఎమ్మార్పీ ఆయకట్టులో విరివిగా
చేపల చెరువులు
ఆధునిక సాంకేతికతను జోడించి
చేపల పెంపకం
ప్రోత్సాహం అందించాలి
ప్రభుత్వం చేపల పెంపకందారులను ప్రోత్సహించేలా రాయితీలు అందించాలి. చెరువులు ఏర్పాటు చేసుకున్న వారందరికీ రాయితీలు రావడం లేదు. దాణాపై పన్నులు తగ్గించి తక్కువ ధరకే అందించేలా చర్యలు తీసుకోవాలి. చేపలు వ్యాధుల బారిన పడకుంగా తీసుకోవల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి
– వేముల లక్ష్మయ్య, మత్స్యకార్మికుడు

మత్స్య పరిశ్రమకు పెరుగుతున్న ఆదరణ

మత్స్య పరిశ్రమకు పెరుగుతున్న ఆదరణ