విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచేలా.. | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచేలా..

Jun 18 2025 3:01 AM | Updated on Jun 18 2025 3:01 AM

విద్య

విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచేలా..

‘పీఎంశ్రీ’ పాఠశాలల్లో దినపత్రికలు,

చిన్నపిల్లల మ్యాగజైన్‌లు కొనుగోలు

చేసేందుకు నిధులు విడుదల

ఉమ్మడి జిల్లాలోని 99 స్కూళ్లకు

రూ.9.90లక్షలు కేటాయించిన కేంద్రం

ఆలేరు: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ప్రతిభకు మరింత పదును పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా(పీఎంశ్రీ) పథకం కింద ఎంపికై న ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడం, సమకాలీన అంశాలపై అవగాహన పెంచడం కోసం దినపత్రికలు, చిన్నపిల్లల మ్యాగజైన్‌ల కొనుగోలుకు చేసేందుకు కేంద్రం తొలిసారి నిధులు మంజూరు చేసింది. ఈ విద్యాసంవత్సరానికి గాను రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖ ద్వారా డీఈఓలకు నిధులు విడుదల చేసింది. పీఎంశ్రీ కింద ఎంపికై న ఒక్కో స్కూల్‌లో దినపత్రికలు, చిన్నపిల్లల మ్యాగజైన్‌ల కొనుగోలుకు రూ.10వేల చొప్పున కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో 99 పీఎంశ్రీ పాఠశాలలకు ఈ మేరకు నిధులు మంజూరయ్యాయి.

జిల్లాల వారీగా నిధులు ఇలా..

యాదాద్రి భువనగిరి జిల్లాలో పీఎంశ్రీ పథకం కింద ఎంపికై న 25 ప్రభుత్వ పాఠశాలలకు రూ.2.50లక్షలు, సూర్యాపేట జిల్లాలో 31 పాఠశాలలకు రూ.3.10లక్షలు, నల్లగొండ జిల్లాలోని 43 పాఠశాలలకు రూ.4.30లక్షల చొప్పున మొత్తం రూ.9.90లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఒక్కో పాఠశాలలో నెలకు రూ.1000 చొప్పున పది నెలల పాటు దినపత్రికలు, చిన్నపిల్ల ల మ్యాగజైన్‌లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

పత్రికల కొనుగోలు ఇలా ఉండాలి..

ప్రతి పాఠశాలలో ఒక తెలుగు దినపత్రిక, ఒక హిందీ లేదా ఉర్దూ దినపత్రిక, ఒక ఇంగ్లిష్‌ దినపత్రిక కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక చిన్నపిల్లల తెలుగు మ్యాగజైన్‌, ఒక హిందీ లేదా ఉర్దూ చిన్నపిల్లల మ్యాగజైన్‌, ఒక ఇంగ్లిష్‌ చిన్నపిల్లల మ్యాగజైన్‌ కొనుగోలు చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి.

ఈ నిధులు పది నెలలకే..

పీఎంశ్రీ కింద ఎంపికై న పాఠశాలల్లో దినపత్రికలు, చిన్నపిల్లల మ్యాగజైన్‌ల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయించింది. ఒక్కో స్కూల్‌కు రూ.10వేలు జమవుతాయి. ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వం సూచించిన ప్రకారం దినపత్రికలు, మ్యాగజైన్‌లు కొనుగోలు చేయాలి. నెలకు రూ.1000 చొప్పున పది నెలలకే బడ్జెట్‌ అలాట్‌ అయ్యింది. విద్యార్థుల్లో పఠనాసక్తితో పాటు కరెంట్‌ అఫైర్స్‌పై పట్టు సాధించేందుకు ఆస్కారం ఉంటుంది.

– సత్యనారాయణ,

డీఈఓ, యాదాద్రి భువనగిరి జిల్లా

విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచేలా..1
1/1

విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచేలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement