రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

Jun 18 2025 3:01 AM | Updated on Jun 18 2025 3:01 AM

రోడ్డు ప్రమాదంలో  యువకుడి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

మునగాల: ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో ప్రమాదానికి గురై యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి మునగాల మండలం ఆకుపాముల శివారులో జరిగింది. ఎస్‌ఐ బి. ప్రవీణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలం కొమరబండ గ్రామానికి చెందిన షేక్‌ దావూద్‌ కుమారుడు షేక్‌ ఇమామ్‌(20) ఏసీ మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం రాత్రి తన స్నేహితుడి ద్విచక్ర వాహనంపై స్వగ్రామం నుంచి వరంగల్‌కు వెళ్తుండగా.. మార్గమధ్యలో విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై మునగాల మండలం ఆకుపాముల శివారులో మాంటిస్సోరి పాఠశాల ఎదుట బైక్‌ అదుపుతప్పడంతో డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇమామ్‌కు తీవ్ర గాయలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి షేక్‌ దావూద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు..

తుర్కపల్లి: ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో లారీ ఆటోను ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తుర్కపల్లి మండలం మాదాపూర్‌ వద్ద మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌ వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో తుర్కపల్లి నుంచి వస్తున్న ట్రాలీ ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొమ్మలరామారం మండలం గోవింద్‌ తండాకు చెందిన ఆటో డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన ఆటో డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వ్యక్తి అదృశ్యం

తిరుమలగిరి(నాగార్జునసాగర్‌): తిరుమలగిరి మండలంలోని నెల్లికల్లు గ్రామానికి చెందిన బైరు కాశయ్య గత నెల 21వ తేదీ నుంచి కనిపించడం లేదని అతడి భార్య గీత మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ యాదయ్య తెలిపారు.

కుక్కల దాడిలో

చిన్నారికి గాయాలు

భూదాన్‌పోచంపల్లి: కుక్కల దాడిలో చిన్నారికి గాయలైన ఘటన మంగళవారం సాయంత్రం పోచంపల్లి పట్టణ కేంద్రంలోని మహమ్మాయికాలనీలో చోటుచేసుకుంది. మహమ్మాయికాలనీకి చెందిన మనస్విక మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి ట్యూషన్‌కు వెళ్తుండగా.. వీఽధి కుక్కలు ఆమైపె దాడి చేసి కాలును కరిచాయి. చిన్నారి భయంతో కేకలు వేస్తుండగా తల్లి జ్యోతి బయటికి వచ్చి కుక్కలను బెదిరించే క్రమంలో ఆమైపె కూడా దాడికి యత్నించాయి. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి గమనించి కర్రతో కుక్కలను తరమగా అవి అక్కడ నుంచి పారిపోయాయి. కుక్కల దాడిలో గాయపడిన చిన్నారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement