భూ ఆక్రమణకు యత్నించిన భార్యాభర్తలపై కేసు | - | Sakshi
Sakshi News home page

భూ ఆక్రమణకు యత్నించిన భార్యాభర్తలపై కేసు

Jun 18 2025 3:01 AM | Updated on Jun 18 2025 3:01 AM

భూ ఆక్రమణకు యత్నించిన భార్యాభర్తలపై కేసు

భూ ఆక్రమణకు యత్నించిన భార్యాభర్తలపై కేసు

నల్లగొండ: భూ వివాదం పెండింగ్‌లో ఉండగానే ఈ నెల 16న భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన భార్యాభర్తలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. మంగళవారం నల్లగొండ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కగనల్‌ మండలం జి.చెన్నారం గ్రామంలోని ఓ భూమి మీదకు ఈ నెల 16న గార్లపాటి భూపాల్‌రెడ్డి, అతని భార్య రామేశ్వరమ్మ.. కందిమల్ల రఘుమారెడ్డి, జమ్మల్ల ప్రభాకర్‌రెడ్డి సాయంతో భూమిని ఆక్రమించుకునేందుకు డోజర్‌ వాహనంతో వచ్చారు. విషయం తెలుసుకున్న కూకుంట్ల శేఖర్‌ తనకు పూర్తి డబ్బులు ఇవ్వకుండానే భూమి వద్దకు వెళ్లొద్దంటూ అడ్డుకోబోయాడు. దీంతో శేఖర్‌ను కూలం పేరుతో దూషించడంతో చంపి అక్కడే పాతి పెడతామని బెదిరించి దాడి చేసి భూమి నుంచి బయటకు తోసి వేశారు. ఈ ఘటనపై కనగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో శేఖర్‌ ఈ నెల 16న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి గార్లపాటి భూపాల్‌రెడ్డి, గార్లపాటి రామేశ్వరమ్మను కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ భూ వివాదం కేసులో భూపాల్‌రెడ్డి, రామేశ్వరమ్మ ఈ నెల 12న నల్లగొండలో ప్రెస్‌మీట్‌ పెట్టి పోలీసులు సహకరించడం లేదని, డబ్బులు డిమాండ్‌ చేశారని ఆరోపించారని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ విషయంపై కనగల్‌ పోలీసులపై శాఖాపరమైన విచారణ జరపగా.. తప్పుడు, నిరాధార ఆరోపణలని తేలిందన్నారు. భూమిని ఆక్రమించడానికి సహకరించనందుకు పోలీసులను ఇరుకున పెట్టే ఉద్దేశంతోనే వారు ఆరోపణలు చేసినట్లు తేలిందని డీఎస్పీ తెలిపారు. ఎవరైనా భూ వివాదాలకు సంబంధించి కబ్జాలో ఉన్న వారితో నేరుగా గాకుండా కోర్టు, రెవెన్యూ శాఖ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. చట్ట విరుద్ధంగా కబ్జాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

వివరాలు వెల్లడించిన నల్లగొండ

డీఎస్పీ శివరాంరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement