
టిప్పర్ బోల్తా.. ట్రాఫిక్కు అంతరాయం
మునగాల: సూర్యాపేట నుంచి కోదాడ వైపు వెళ్తున్న టిప్పర్ మంగళవారం రాత్రి విజయవాడ–హైదరాబాద్ హైవేపై మునగాల మండల కేంద్రంలోని సివిల్ ఆస్పత్రి ఎదురుగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనతో అర్ధగంట ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మునగాల ఎస్ఐ బి. ప్రవీణ్కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. టిప్పర్ను రోడ్డు పక్కకు తొలగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ట్రాఫిక్కు అంతరాయం కల్గడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ఆత్మకూరు(ఎం): ఇంటి వద్ద సింగిల్ ఫేజ్ మోటారుకు రిపేర్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆత్మకూరు(ఎం) మండలం తుక్కాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని పోసానికుంటలో మంగళవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పోసానికుంట గ్రామానికి చెందిన సామ సుధాకర్రెడ్డి(45) మంగళవారం ఉదయం తన ఇంటి వద్ద సింగిల్ ఫేజ్ మోటారును రిపేరు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించి అతడిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

టిప్పర్ బోల్తా.. ట్రాఫిక్కు అంతరాయం